తిరుపతి ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు..?
NEWS Jan 09,2025 11:48 am
తిరుపతిలో తొక్కిసలాటకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు వైసీపీ సీనియర్ లీడర్ లక్ష్మీ పార్వతి. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేశారని, మరి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను బాధ్యులను చేస్తారా అంటూ నిలదీశారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ ఆవేదన చెందారు.