పోచారంతో ఎమెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటి
NEWS Jan 09,2025 11:55 am
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వెంట వ్యాపారవేత్త భాస్కర్ రెడ్డి ఉన్నారు.