ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
NEWS Jan 09,2025 09:54 am
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. నాణ్యతతో పనులను నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలన్నారు.