తిరుపతి ఘటనపై విచారణ జరిపించాలి
NEWS Jan 09,2025 09:13 am
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఈ ఘటనపై మోడీ స్పందించాలని, తక్షణమే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపించాలన్నారు.