తిరుపతి ఘటనపై ఎవరు రాజీనామా చేస్తారు..?
NEWS Jan 09,2025 08:12 am
తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఎవరు నైతిక బాధ్యత వహిస్తారని, సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్లలో ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి. కూటమి సర్కార్ తిరుమలను, టీటీడీని రాజకీయ వేదికగా మార్చేసిందని ఆరోపించారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కోరికి రూ. కోటి రూపాయలు ఇవ్వాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఇలా జరిగిందన్నారు.