సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
NEWS Jan 09,2025 09:55 am
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసీపీ వెంకటేశ్వర్రావు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సైబర్ మోసాల గురించి ప్రస్తావిస్తూ, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ వివరాలు వెల్లడించకూడదని సూచించారు.