తిరుపతి ఘటనపై సీఎంల దిగ్భ్రాంతి
NEWS Jan 09,2025 05:07 am
తిరుపతిలో టీటీడీ జారీ చేసిన టోకెన్లకు సంబంధించి జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరుగురు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏపీ, తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి. ఘటనపై డీజీపీ, టీటీడీ చైర్మన్ తో మాట్లాడారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.