తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరం
NEWS Jan 09,2025 04:56 am
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందడం పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామని పేర్కొన్నారు.