ఎమ్మార్వో ఆఫీస్ ను తనిఖీ చేసిన పొన్నం
NEWS Jan 08,2025 11:35 am
హైదరాబాద్ లోని షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సిబ్బంది హాజరు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ అప్లికేషన్ లను పరిశీలించారు. ప్రజా పాలన అప్లికేషన్లు, ఆన్ లైన్ లో సాంకేతిక సమస్యలపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఇన్ వార్డు, ఔట్ వార్డు రిజిస్టర్ సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.