మోడీ టూర్ పై షర్మిల ఫైర్
NEWS Jan 08,2025 10:42 am
విశాఖ జిల్లాలో పీఎం మోడీ పర్యటించడంపై స్పందించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గతంలో ఎన్నో వాగ్ధానాలను ఇచ్చారని, వాటిని పట్టించు కోలేదని ఆరోపించారు. ఎవరిని ఉద్దరించేందుకు ఇక్కడికి వచ్చారో చెప్పాలన్నారు. విభజన హామీలపై చేసిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ప్రత్యేక హోదా ఏమైందని నిలదీశారు. 15 ఏళ్లు దాటినా దాని ఊసెత్తక పోవడం సిగ్గు చేటన్నారు.