ఈడీ ముందుకు బీఎల్ఎన్ రెడ్డి
NEWS Jan 08,2025 10:38 am
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా ఇవాళ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు.