కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం
NEWS Jan 08,2025 10:32 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభ మేళా జరుగుతుందని, 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు.