పచ్చి పసుపు తెచ్చి నష్టపోవద్దు
NEWS Jan 08,2025 05:23 am
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డు పసుపు విక్రయాల్లో దేశంలోనే పేరుగాంచిందని, రైతులు పచ్చి పసుపు తీసుకొచ్చి నష్టపోవద్దని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అన్నారు.ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పసుపు రైతుల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలను నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.బాగా ఎండిన పసుపును మా త్రమే తీసుకు రావాలని, 12లోపు తేమశాతం ఉండేలా తీసుకొస్తే రూ.10వేలకు తగ్గకుండా ధర పలికేలా మార్కెట్ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.