విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ
NEWS Jan 08,2025 04:11 am
ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పి. వెంకట రామి రెడ్డిలు విద్యుత్ టారీఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ప్రజలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని, అలాగే అభ్యంతరాలను, విజ్ఞాపనలను, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.