న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి
NEWS Jan 07,2025 10:26 pm
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి తనను న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని అన్నారు. తమ లాయర్ తనతోనే ఉండాలన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లడం కోసం, ప్రపంచంలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసమే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించామన్నారు.