5 ప్రాజెక్టులకు భూముల కేటాయింపు
NEWS Jan 07,2025 10:03 pm
ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2.60 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే 5 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు గాను భూములు కేటాయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ కె. విజయ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అద్దం పట్టేలా, అన్ని ప్రాంతాలకు ప్రాముఖ్యత ఇచ్చే ప్రాజెక్ట్ లకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.