కేటీఆర్ కు ఈడీ నోటీసులు
NEWS Jan 07,2025 09:49 pm
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ వైపు హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తే మరో వైపు ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఏసీబీ ఏ1, ఏ2, ఏ3లుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేపట్టిగా ఈడీ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.