గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
NEWS Jan 08,2025 05:24 am
సుల్తానాబాద్: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం కనుకుల పీఏసీఎస్ ఆధ్వర్యంలో రామునిపల్లి, కనుకులలో రూర్బన్ పథకం కింద నిర్మించిన గోదాములను, సొసైటీ కార్యాలయ విస్తరణ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు కోట వీణ, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సీఈవో శంకర్, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొన్నారు.