విజయీభవ అవగాహన సదస్సు
NEWS Jan 07,2025 03:14 pm
భయం విడితే 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం సులభతరం అవుతుందని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్తులకు పరీక్షలు ఎలా రాస్తే ఉత్తీర్ణత సంధించవచ్చునో తెలిపేందుకు విజయీభవ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా మాథమేటిక్స్, సైన్స్, హిందీ, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ముఖ్యమైన ప్రశ్నలు, ముఖ్యమైన సబ్జెక్టులపై అవగాహన కల్పించారు.