కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు కామెంట్స్
NEWS Jan 07,2025 12:17 pm
కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాల్సిందేనని పేర్కొంది. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని, ఎవరు లబ్ది పొందారో తెలియాలన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలన్నారు. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలన్నారు. ఈ కేసులో ఇప్పుడే జోక్యం చేసుకోమన్నారు.