ప్రియాంకపై కామెంట్స్ భట్టి సీరియస్
NEWS Jan 07,2025 12:11 pm
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బీజేపీ నేత చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సిగ్గు పడాలని, భారతీయ సంస్కృతిపై జరిగిన దాడిగా గుర్తించాలన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.