అనంతపురంలో డాకు మహారాజ్ ఈవెంట్
NEWS Jan 07,2025 08:09 am
ఈనెల 9న అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. సినీ తారలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. హీరో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ , ఊర్వశి రౌటేలాతో పాటు దర్శకుడు, నిర్మాత హాజరు కానున్నారు. ముఖ్య అతిథిగా అల్లుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. పెద్ద ఎత్తున సీమకు చెందిన ఫ్యాన్స్ పాల్గొననున్నారు.