ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలి
NEWS Jan 07,2025 12:38 pm
ప్రతి గ్రామం శుభ్రంగా ఉండేలా పరిశుభ్రత పనులు చేయించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. స్వచ్ఛత, పరిశుభ్రత తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిత్యం ఉదయం 9 గంటలకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.