హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన వద్దు
NEWS Jan 07,2025 03:46 am
హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇప్పటికే భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వైరస్ వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. దీనిని 2001లో గుర్తించారని తెలిపారు. ఇది చాలా ఏళ్ల నుండి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోందన్నారు. ఈ వైరస్ గాలి, శ్వాస ద్వారా వ్యాపిస్తోందన్నారు. ప్రత్యేకించి శీతాకాలం , వసంత రుతువు ప్రారంభంలో ప్రభావితం చేస్తుందన్నారు.