బ్రాహ్మణగూడెంలో ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ
NEWS Jan 07,2025 05:52 am
గుర్రంపోడు మండలంలోని బ్రహ్మణగూడెం గ్రామంలో ఈ నెల 3న జూనూంతుల గ్రామానికి చెందిన మారపాక సుధాకర్ను బ్రహ్మణగూడెం గ్రామానికి చెందిన బెల్లి వెంకన్న, పగడాల సైదులు మరికొందరు వ్యక్తులు విచక్షన రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసు విషయమై దేవరకొండ ASP మౌనిక ఐపీఎస్ సోమవారం విచారణ చేసి, గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆమె వెంట కొండమల్లెపల్లి సీఐ ధనుంజయ్ గౌడ్, గుర్రంపోడ్ ఎస్ఐ పసుపులేటి మధు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.