ఇసుక కొరత లేకుండా చూడాలి
NEWS Jan 07,2025 03:25 am
కాకినాడ , తూర్పు గోదావరి జిల్లాల్లో ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మంత్రి పొంగూరు నారాయణ. గోదావరి రేవుల నుంచి ప్రస్తుతం ఇసుక సరఫరా అవుతోందని , కానీ ప్రజల డిమాండ్ కు అనుగుణంగా సరిపోవడం లేదంటూ ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన నారాయణ వెంటనే మరికొన్ని ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయాలని, కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.