కేపీ అగ్రహారంలో తాగునీటి బోరు
NEWS Jan 07,2025 06:10 am
బుచ్చయ్యపేట మండలం కేపి అగ్రహారంలో గోపిశెట్టి వారి కల్లాలు దగ్గర జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు దొండా రాంబాబు నిధులతో మంచి నీటి బోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ ఎర్ర వాయి ప్రాంతానికి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్న జడ్పిటిసి రాంబాబును అపర భగీరధుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనుతోపాటు ఉప సర్పంచ్ ముసిలి నాయుడు, మాజీ సర్పంచ్ రమణ, స్కూల్ చైర్మన్ పి గాంధీ, స్కూల్ చైర్మన్ నూకరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.