భూసమస్యలు పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు
NEWS Jan 06,2025 04:29 pm
బుచ్చయ్యపేట మండలం పెదపూడి గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన రెవెన్యూ సదస్సులో రీసర్వే డిటి లక్ష్మీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేసవిలో తప్పులు సవరించుట కొరకు, గ్రామంలో ఎటువంటి భూ సమస్య ఉన్న తక్షణ పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల TDP అధ్యక్షులు కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ వర కృష్ణ, గ్రామ నీటి సంఘం అధ్యక్షులు తాతారావు యాదవ్తో పాటు రెవెన్యూ సిబ్బంది, పలువురు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.