తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత
NEWS Jan 06,2025 03:29 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం మండల రైతులు తహశీల్దార్ వీర్ సింగ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పంటకు రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాలని, పంట బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల రైతులు మెరుపు గంగరాజం, కాసారపు భూమరెడ్డి, పోచంపల్లి రమేష్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.