పీఎం విశాఖ టూర్ పై అనిత సమీక్ష
NEWS Jan 06,2025 02:35 pm
విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారని వెల్లడించారు మంత్రి వంగలపూడి అనిత. తన నివాసంలో కూటమి నేతల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. నక్కలపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారని, ఈ టూర్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ విశాఖకు రావడం మన అందరి అదృష్టమన్నారు. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.