ఏపీలో ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేత
NEWS Jan 06,2025 02:28 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇవాల్టి నుంచి ఈహెచ్ఎస్ సేవలు , ఓపీ నిలిపి వేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్ల రూపాయల బకాయిలు నిలిచి పోయాయని, ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించింది. 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని అల్టిమేటం ఇచ్చింది.