కోరుట్ల పురపాలక కౌన్సిల్ సాధారణ సమావేశం
NEWS Jan 06,2025 02:19 pm
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభించే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో 23 అంశాలను పొందుపరచగా అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ ముజఫర్ హైమత్ (సజ్జు భాయ్ ) పాల్గొన్నారు.