వాటర్ ప్లాంట్ ప్రారంభించిన డిఇఓ
NEWS Jan 06,2025 04:31 pm
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల దాహార్తి తీర్చడం కోసం చంద్రశేఖర్ సేవా సంస్థ వారి దాతృత్వంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీనిని మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధిపతి భారతి,జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్ మూర్తి, మండల విద్యాశాఖ అధికారి నీలకంఠం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖా, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.