7 అంతస్తుల అక్రమ భవనం కూల్చివేత
NEWS Jan 06,2025 06:21 am
హైడ్రా దూకుడు పెంచింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన 7 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చి వేసింది. అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోక పోవడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ కూల్చాలని స్పష్టం చేశారు. పార్కింగ్, ఫైర్ సేఫ్టీ లేక పోవడం, సెలార్ లో కిచెన్ ఏర్పాటు చేయలేదని కూల్చేశారు.