కుమారస్వామిపై భగ్గుమన్న సీఎం
NEWS Jan 06,2025 06:09 am
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ అవినీతికి కేరాఫ్ గా మారిందంటూ సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామిపై భగ్గుమన్నారు సీఎం సిద్దరామయ్య. దమ్ముంటే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని , తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 60 శాతం కమీషన్లు తీసుకుంటున్నామని కామెంట్స్ చేయడం తన స్థాయికి తగదన్నారు. మంత్రులు ఎక్కడ అవినీతికి పాల్పడ్డారో చెప్పాలన్నారు.