చెర్రీ ఫ్యాన్స్ ఫ్యామిలీస్ కు ఆర్థిక సాయం
NEWS Jan 06,2025 05:27 am
రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలిసిన నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. చని పోయిన ఆ బాధిత కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల చొప్పున సాయం అందజేస్తామని వెల్లడించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.