ఇన్వెస్టర్లకు ఏపీ సర్కార్ ఆఫర్
NEWS Jan 06,2025 05:13 am
ఏపీలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పర్యాటక రంగంలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చామని, సీపీపీ విధానంలో ముందుకు వెళుతున్నామని చెప్పారు. పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించారు. వెంటనే ఇన్వెస్ట్ చేసేందుకు రావాలని పిలుపునిచ్చారు.