కరీంనగర్: నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
NEWS Jan 06,2025 05:58 am
కరీంనగర్ పట్టణంలో సబ్ స్టేషన్ మరమ్మతుల్లో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని విద్యుత్ శాఖ టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని జానకి చికెన్ సెంటర్ ఏరియా, వావిలాలపల్లి, బల్మూరి టవర్స్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.