పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Jan 06,2025 03:48 am
సీతయ్య పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003 - 04 పదవ వ తరగతి విద్యార్థులు అందరూ సుమారుగా 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళ్యాణపులో కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా దూరం నుండి మిత్రులందరూ కలవడానికి ఒక దగ్గర చేరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా ఆ రోజంతా గడిపారు. ఈ కార్యక్రమంలో పప్పల రాము, పిల్ల వెంకట్రావు మాట్లాడుతూ మా బ్యాచ్ లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం కలిసి పంచుకుంటామని ఫ్రెండ్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.