కాంగ్రెస్లోకి ఏబీవీపీ నేత శ్రీనివాస్
NEWS Jan 06,2025 06:03 am
ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఏబీవీపీ జిల్లా ఎక్స్ కన్వీనర్ కలిగోట్ శ్రీనివాస్ తన 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తామన్నారు.