ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సైన్స్ క్విజ్
NEWS Jan 05,2025 02:11 pm
నిజామాబాద్: గ్రామీణ విద్యార్థులు ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి అన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ -2025 పోటీ నిజామాబాద్ ఖలీల్ వాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి 71 పాఠశాలల నుంచి 552 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నవారికి బహుమతులు అందించారు.