పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగికి నీటి విడుదల
NEWS Jan 05,2025 08:58 am
పోచారం ప్రాజెక్టు పరిధిలో యాసంగి పంటల సాగు కోసం ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నీటిని ఈ యాసంగి సీజన్లో ఏ జోన్కు కేటాయించామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.595 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు భూములకు 5విడతలో 1.520 టీఎంసీల నీటిని అందిస్తామని తెలిపారు.