టీటీడీ ఏర్పాట్లపై చైర్మన్ పరిశీలన
NEWS Jan 05,2025 08:42 am
వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు పరిశీలించారు. ఈవో, ఏఈవోతో కలిసి బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డి టోకెన్ జారీ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్ హౌస్లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.