సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల పాదయాత్ర
NEWS Jan 05,2025 08:17 am
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి మల్యాల మండలం కొండగట్టు వరకు సమగ్రా శిక్ష అభియాన్ ఉద్యోగులు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి ఉద్యోగులకు అండగా నిలవాలని వారు కోరారు.