పాలమూరు ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు
NEWS Jan 05,2025 04:08 am
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బెస్ట్ పార్లమెంటేరియన్, దివంగత కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరును పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు సింగూరు ప్రాజెక్టుకు ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి సిలారపు రాజ నరసింహ పేరు పెట్టేందుకు ఓకే చెప్పింది.