శ్రీ సాయిరామ దేవాలయంలో హుండీ లెక్కింపు
NEWS Jan 04,2025 03:23 pm
కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం హుండీలను లెక్కించారు. 2 లక్షల 69 వేల 99 రూపాయలు నగదు రూపంలో వచ్చాయి. మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి కంసాలి లేనందున తిరిగి హుండీలోనే వేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎం. రాజమొగిలి, పట్టణపుర ప్రముఖులు, సేవా భక్తులు దేవాలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కే.కాంతరెడ్డి తెలిపారు.