జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు
NEWS Jan 04,2025 03:35 pm
కథలాపూర్ మండల స్థాయిలో నిర్వహించిన ఇంగ్లీషు ఒలంపియాడ్ టెస్టులో కథలాపూర్ మోడల్ స్కూల్ కు చెందిన ఎం వరలక్ష్మి , కే సహస్ర మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్టు కథలాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ అనిత, అంగ్ల ఉపాద్యాయులు రాజు జాదవ్, హరునొద్దిన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, రవికుమార్, మహేష్, రాజు జాదవ్ ,విజయ్, హారునోద్దీన్,పి టీ రవి పాల్గొన్నారు.