ఉమ్మడి ఏపీలోనే బాగున్నాం
NEWS Jan 04,2025 12:12 pm
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తాను సమైక్యవాదినని నిరూపించుకున్నారు. తెలంగాణ కంటే ఉమ్మడి ఏపీనే బాగుండేదన్నారు. కొత్త రాష్ట్రం వచ్చాక ఎక్కువగా నష్ట పోయామని వాపోయారు. వస్తున్న ఆదాయం సరిపోవడం లేదన్నారు. ప్రతి నెలా రూ. 4 వేల కోట్లు కావాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేయలేక పోతున్నామని చెప్పారు సీఎం.