టీటీడీకి వెండి ఆభరణాలు విరాళం
NEWS Jan 04,2025 11:23 am
అలిపిరి పాదాల మండపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టివి ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన రూ. 5 లక్షల విలువైన వెండి పాదుకలు, వెండి కిరిటం, వరద హస్తం, కఠి హస్తం మరికొన్ని అభరణాలను టీటీడీకి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.