వైకుంఠ ఏకాదశి దర్శనానికి 1.20 లక్షల టోకెన్లు
NEWS Jan 04,2025 10:55 am
వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలకు వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుపతి, తిరుమలలో ఆయన పర్యటించారు/ పనుల ప్రగతిని పరిశీలించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు.